Saturday, May 18, 2024
- Advertisement -

మోదీ వ‌చ్చి చెప్పినా ఓటు జ‌న్‌కే….టిడిపికి , జనసేన పార్టీకి ఓటు వేయను

- Advertisement -

ర‌చ‌యిత‌, ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఓఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ముక్కుసూటిగా త‌న నిర్ణ‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డించారు.ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ‌చ్చి చె ప్పినా భాజాపాకు ఓటు వేయ‌న‌ని ….వైసీపీ అధినేత జ‌గ‌న్‌కే త‌ను ప్ర‌చారం చేస్తాన‌ని పోసాని కృష్ణమురళి అన్నారు.

తనను ఎవరు ప్రలోభపెట్టినా.. ఏం చేసినా, డబ్బు, పదవి ఏమిస్తానన్నా.. తన ఓటు మాత్రం వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని… జగన్‌కే ప్రచారం చేస్తానని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరుగుండదని, తన వ్యక్తిత్వమే అలాంటిదని పోసాని తెలిపాడు. పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. జగన్ పోటీ చేయమన్నా చేయనని పోసాని స్పష్టం చేశాడు.

తాను వచ్చే ఎన్నికల్లో టిడిపికి లేదా జనసేన పార్టీకి ఓటు వేయనని పోసాని తేల్చి చెప్పారు. చంద్రబాబు సమర్థుడైన నాయకుడు అని, అందుకే గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేశానని చెప్పారు. చంద్రబాబులో అప్పుడు కనిపించిన సమర్థత ఇప్పుడు లేదన్నారు. ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ గురించి అస‌లే ఆలోచించ‌డంలేద‌న్నారు.

https://www.youtube.com/watch?v=KR6TEkf_hIA

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -