- Advertisement -
జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో డిసెంబర్ 24వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
ఆయన మృతి చెందడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. పేద ప్రజలు అంటే ఆయనకు ఇష్టమని ఆయన మృతి కలిచి వేసిందని హోం మంత్రి రాజ్ నాత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని తెలుస్తోంది.
1936 జనవరి 12వ తేదీన ముఫ్తీ జన్మించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా ముఫ్తీ పనిచేశారు