- Advertisement -
ముంబైలోని డోంగ్రీ నాలుగంతస్తుల భవనం మంగళవారం కుప్ప కూలింది. భవన శిథిలాల కింద 40-50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ, రక్షర దళాలు సహాయ చర్యల్ని అందిస్తున్నాయి.
వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఘటనాస్థలానికి చేరుకొని… రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారిని బటయకు తీసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.