Sunday, April 28, 2024
- Advertisement -

జూనియర్ ఆర్టిస్టును రేప్ చేసిన టీవీ షో ప్రొడ్యూసర్ కు ఏడేళ్ల జైలు శిక్ష..

- Advertisement -

జూనియర్‌ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడిన ఓ టీవీ ప్రొడ్యూసర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. 31ఏళ్ల జూనియర్ నటిపై అత్యాచారం చేసిన ఆరోపణలను ధృవీకరించిన కోర్టు అతగాడికి ఏడేళ్ల కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళితే, 2012 సంవత్సరంలో ‘ఏక్ వీర్ కీ అరదాస్ వీర్’ టీవీ షో నిర్మాతగా ఉన్న ముకేష్ మిశ్రా (33), ఓ జూనియర్ ఆర్టిస్టు (33)కు షూటింగ్ ఉందని, పొద్దున్నే రావాలని ఫోన్ చేశాడు. ఆమె ఆదరాబాదరాగా బస్ స్టాపుకు చేరుకోగా, అక్కడే ఉన్న ముకేష్, బస్సులో వెళితే లేట్ అవుతుందని చెబుతూ, తన బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మేకప్ రూముకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఆపై పదే పదే ఆమెను లైంగికంగా వేధించాడు.

వేధింపులు భ‌రించ‌లేక భర్త సహాయంతో 2013 జనవరిలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ముకేష్‌ను దోషిగా తేల్చింది. నేరస్తుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు 5వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -