Tuesday, May 14, 2024
- Advertisement -

కృష్ణా జిల్లాలో దారుణం.. బ్యూటీషియ‌న్‌పై హ‌త్యాయ‌త్నం.. అక్ర‌మ‌సంబంధ‌మే కార‌ణ‌మా..?

- Advertisement -

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో విడిపోయి ఉంటున్న ఓ మహిళకు దగ్గరైన యువకుడు చివరికి ఆమెపైనే హత్యాయత్నం చేశాడు. బాపులపాడుకు చెందిన పద్మ అనే మహిళ స్థానికంగా బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. భర్తతో విభేదాలు రావడంతో గత కొద్దికాలంగా పద్మ అతనికి దూరంగా ఉంటోంది. ఈనేప‌థ్యంలో నూతన్ ప్రసాద్ అనే యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ వివాహేతర సంబంధంపై పద్మ, ప్రసాద్ ల మధ్య విభేదాలు వచ్చాయి.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్ ఈ రోజు ఉదయం పద్మ కాళ్లు, చేతులను ఎలక్ట్రానిక్ మోటార్లకు వాడే ప్రత్యేకమైన వైర్ తో కట్టేశాడు. అనంతరం కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. పద్మ అరుపులను విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు మహిళ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఈ దాడికి పాల్పడిన ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తేలింది.ఆమెపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని ఇటు బంధువులు, అటు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులువ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -