Friday, April 26, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దాడి..ట్వీట్ చేసిన నారా లోకేష్‌

- Advertisement -

వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలకు నేటి సమాజంలో చోటు లేదంటూ లోకేష్ ట్వీట్ చేశారు.విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియ‌ని వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో జ‌గ‌న్ భూజానికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి.

సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. శ్రీనివాస్ దాడిలో స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డ జ‌గ‌న్ ప్ర‌థ‌మ చికిత్స తీసుకున్న జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -