Sunday, May 12, 2024
- Advertisement -

చంద్రబాబు గారూ నిద్ర లేవండి

- Advertisement -

నవ్యాంధ్ర కి ప్రత్యేక హోదా అవకాశాలు కొంచెం కూడా లేనట్టే ఉంది పరిస్థితి. ఆర్ధికంగా ప్రత్యెక సాయం ఏమైనా చేస్తాం తప్ప అంతకంటే ఏమే చెయ్యలేం అనీ ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తే అందరూ అడుగుతారు మా వల్ల కాదు అంటోంది బీజేపీ ఈ పరిస్థితి లో కేంద్రం ని నెమ్మదిగా అడిగితే అయ్యే పని కనపడట్లేదు. గట్టిగా గొడవ పెట్టుకోవాల్సిందే. చిన్న సైజు ఉద్యమం అయినా లేవదీయాల్సిన పరిస్థితి ఉంది.

ఈ లెక్కన చూస్తే ఎలాగో ఇచ్చే సొమ్ములు తక్కువే కాబట్టి చంద్రబాబు గారు కేంద్రం తో సీరియస్ గా ఫైట్ చెయ్యాలి అనే కోరుతున్నారు జనం కూడా. నిజానికి చంద్రబాబు చెబుతున్నట్లుగా మోడీ అపాయింటుమెంటు కూడా దొరక్కపోయే పరిస్థితి వస్తే ఏమవుతుంది. మిగతా రాష్ర్టాలు మోడీకి మోకరిల్లకుండా పాలించడం లేదా? నవీన్పట్నాయక్ జయలలిత నితీష్కుమార్ మమతాబెనర్జీలు కూడా ఎన్డిఎలో భాగస్వాములు కారు. వారిలో జయలలిత ఒక్కరే కొంత మోడీకి అనుకూలంగా ఉన్నారు.

అయినా వారెవ్వరూ కేంద్రం ముందు తలొగ్గడంలేదు. కానీ… నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు వారికి వస్తున్నాయి. నవ్యాంధ్రకు కూడా అంతకుమించి ఏమీ రావడం లేదు. అలాంటప్పుడు కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి. కేంద్రంతో కొట్లాడితే కొత్తగా పోయేదేమీ లేదని తెలిసినా చంద్రబాబు మౌనం ఎందుకో అని టీడీపీ శ్రేణుల్లోనూ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -