Sunday, May 12, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో కొత్త ట్విస్ట్‌

- Advertisement -
New Twist in Nandyal by elections ticket..

ఉపఎన్నికల షెడ్యూల్ రాకముందే నంద్యాల రాజ‌కీయం వేడెక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూమా అఖిలప్రియ నంద్యాలను కేంద్రంగా చేసుకొని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు.ప్రధానంగా తన తండ్రి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ఆమె వేగంగా పనులను చేస్తున్నారు.

అయితే నంద్యాల కేంద్రంగా చేసుకొని అఖిలప్రియ కార్యక్రమాలను చేపట్టడాన్ని శిల్పావర్గం వ్యతిరేకించింది. అయితే శిల్పా టిడిపికి రాజీనామా చేయడంతో ఇక భూమా అఖిలప్రియకు అడ్డంకులు లేకుండా పోయాయి.

{loadmodule mod_custom,GA1}

చంద్రబాబు పర్యటన ఈ నెల 21వ, తేదిన నంద్యాలలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హమీలను నేరవేర్చే క్రమంలోనే ఈ పథకానికి బాబు శంకుస్థాపన చేయనున్నారు.
భూమా కుటుంబానికి లైన్ క్లియర్ నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీచేసే విషయమై భూమా కుటుంబానికి లైన్ క్లియరైంది. టిడిపికి శిల్పా మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పడంతో భూమా కుటుంబానికి ఈ స్థానం నుండి టిడిపి టిక్కెట్టు విషయంలో పోటీ లేకుండాపోయింది.

{loadmodule mod_custom,GA2}

అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ చోటుచేసుకోబోంతుందా..! గ‌తంలో టికెట్టు విష‌యంలో త‌న చెల్లెలు మౌనిక‌ను రంగంలోకి దింపాల‌నే వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి.అయితే ఇప్పుడు టికెట్టు విష‌యంలో పోటీలేకుండా పోవ‌డంతో ఇప్పుడు భూమా అఖిలప్రియ సోదరుడు బ్రహ్మనందరెడ్డికా లేకా అఖిల ప్రియ చెల్లెలు మౌనిక‌కా అన్నిది తేలాల్సి ఉంది. ఇప్పటికే బ్రహ్మనందరెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}GP6QFkv9TgI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -