నంద్యాల ఉప ఎన్నిక విషయంలో భూమా అఖిలప్రియకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎన్నిక ఏకగ్రీవం కోసం అఖిల ప్రియ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.
తమ కుంటుంబనుంచి ని లబెడితో …వైసీపీతో ఉన్న సాన్నిహిత్యంతో పోటీలేకుండా చేసేందుకు …విజయమ్మతో అఖిల నడిపిన రాయబాబరం ఫలించలేదు. దీంతో ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
{loadmodule mod_custom,GA1}
మరోవైపు, జగన్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మొదటినుంచి వైసీపీ తరుపునుంచి అభ్యర్తిని నిలబెడతామని తేల్చి చెప్పారు.అదే సమయంలో ఏకగ్రీవం కోసం టిడిపి చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని సమాచారం.
కాటసాని రాంరెడ్డి ద్వారా అఖిలప్రియ ఏకగ్రీవం కోసం రాయబారం నెరపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విజయమ్మతో చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. కానీ విజయమ్మ నుంచి అఖిలకు ఎలాంటి హామీ రాలేదు.దీంతో అఖిల ఆశలు అడియాశలయ్యాయి.ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీ తరుపును అభ్యర్తి నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
{loadmodule mod_custom,GA2}
నంద్యాలపై జగన్ సీరియస్గా ఉండటం వల్లనే ఎలాంటి హామీ రాలేదని అంటున్నారు. జిల్లాలో తనకు అండగా ఉంటారని భావించిన భూమా ఫ్యామిలీ తనను వదిలి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని జగన్ భూమా ఫ్యామిలీ బరిలోకి దిగినా పోటీకే సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వైసిపి పోటీకే సిద్ధమవడంతో టిడిపి కూడా ఏకగ్రీవం ప్రయత్నాలను విరమించిందని అంటున్నారు.ఇక నంద్యాల ఉప ఎన్నిక పోటీ రసవత్తరంగా మారనుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- వైసీపీలోకి వలసల పర్వం
- వైసీపీ వచ్చే ఎన్నికల్లో సింగిల్గా మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుంది….
- త్వరలోజగన్తో శిల్పామోహన్రెడ్డి భేటీ
- అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..!
{youtube}ISs6a-cQ7NA{/youtube}