- Advertisement -
కాశీ వెళ్లిన తెలుగు వారు ఇక్కట్లలో పడ్డారు. విజయవాడ, గుంటూరు, నిజామాబాద్ జిల్లాల నుంచి దాదాపు 150 మంది యాత్రికులు కాశీ వెళ్లారు. అక్కడి నుంచి వీరంతా కేదారినాథ్ కు వెళ్లేందుకు హెలికాఫ్టర్ టిక్కట్లు కొన్నారు.
ఆ టిక్కట్లు నకిలీవని, తమకు టిక్కట్లు విక్రయించిన ఏజెంట్ నకిలీ ఏజెంట్ అని తెలిసింది వారంతా లబోదిబోమంటున్నారు. ఒక్కో యాత్రికుడి నుంచి టిక్కట్ల నిమిత్తం 8300 రూపాయలు వసూలు చేసి ఏజెంట్ చెక్కేశాడు. మోసం గురించి తెలుసుకున్న యాత్రికులు కేదారినాథ్ లో ఏజెంట్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.