Wednesday, May 1, 2024
- Advertisement -

పాక్ కు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ కౌంటర్ ఇచ్చిన అజిత్ దోవల్..

- Advertisement -

కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ మండిపడుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో అక్కసను వెల్లగక్కుతోంది. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తోంది. అంతే కాకుండా భారత్ తో ఉన్న వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించింది. మరో వైపు పాక్ లో భారత్ సినిమాలు ఆడకుండా నిషేధం విధించింది. సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను కూడా రద్దు చేసింది.

పాక్ తీసుకున్న నిర్ణయంపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెటకారంగా స్పందించారు. భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ రద్దు చేసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు పాక్ నిర్ణయంతో తీరని నష్టం వాటిల్లుతుంది. అది ఎంతగానంటే… విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఓ ప్రమోషనల్ పోస్ట్ పెడితే ఎంత ఆదాయం వస్తుందో అంత నష్టం భారత్ కు కలుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో?’ అంటూ అజిత్ దోవల్ ఎద్దేవా చేశారు. తద్వారా పాకిస్థాన్ నిర్ణయాన్ని పూచికపుల్లలా తీసి పడేశారు. అజిత్ దోవల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/AjitKDoval_NSA/status/1159290627881783296

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -