- Advertisement -
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ 2020లో భాగంగా.. 13 పురస్కారాలను సొంతం చేసుకుంది భారతీయ రైల్వే. వివిధ విభాగాలకు ఈ అవార్డులు వచ్చినట్టు రైల్వే వెల్లడించింది.భవనాల విభాగంలో భావ్నగర్, రాజకోట్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలు తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఈశాన్య రైల్వే పరిధిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలోని విద్యుత్ విభాగానికి మెరిట్ సర్టిఫికెట్ దక్కింది.
స్వచ్ఛమైన, పర్యావరణహిత రవాణాను అందించేందుకు రైల్వే చేస్తున్న నిర్విరామ కృషి ఫలితమే ఈ అవార్డులు. రవాణా విభాగంలో పశ్చిమ రైల్వేకు మొదటి స్థానం, తూర్పు రైల్వేకు రెండవ స్థానం దక్కాయి. ఈశాన్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలకు మెరిట్ సర్టిఫికెట్లు అందాయి అని భారతీయ రైల్వే తెలిపింది.