Friday, April 19, 2024
- Advertisement -

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

- Advertisement -

ఒకప్పుడు హూటల్ కి వెళ్లితే గాజు గ్లాసుల్లో టీ ఇచ్చేవారు. తర్వాత ట్రెండ్ మారింది.. ఇప్పుడు పేపర్ కప్ లో ఇస్తున్నారు. టీ కప్పుడు శుభ్రంగా ఉంటాయో ఉండవో అని అనుమానంతో పేపర్ టీ కప్పుల్లో తాగుతున్నామని అంటున్నారు. అయితే ఇది ప్రమాదం అంటున్నారు పరిశోదకులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎంతగా కష్టాలు పెడుతున్నాయో తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో పేపర్‌ కప్పుల వాడకం మరింత పెరిగిపోయింది. అయితే, వాటిల్లో టీ తాగితే అనారోగ్యం పాలవుతారని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు తెలిపారు.

డిస్పోజబుల్ పేపర్‌ కప్పుల్లో మూడుసార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున టీ తాగడం వల్ల 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోనికి వెళతాయని తేల్చారు. పేపర్‌ కప్పుల్లో టీ పోసినప్పుడు ఆ పేపర్‌లోని మైక్రోప్లాస్టిక్‌ కణాలతో పాటు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోయి శరీరంలోకి వెళ్తున్నాయని చెప్పారు.  80-90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయని అన్నారు.

దీంతో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు శరరీంలోకి వెళ్తాయని తెలిపారు.   పాలీ ఇథలీన్‌ ఉంటుందని చెప్పారు. టీ లేక ఇతర ఏ వేడి ద్రవం పోసినా 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్‌ లేయర్‌లో చర్య జరుగుతుందని వివరించారు.

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

ప‌చ్చిమిర్చి ప్ర‌తీరోజు తీసుకోవ‌డం వ‌ల‌న క‌లిగే ఆరోగ్య లాభాలు

వంద‌సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా జీవించాలంటెఇవి తినండి……

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే సిరిసంపదలు మీ వెంటే!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -