Wednesday, May 8, 2024
- Advertisement -

ప‌ర్య‌టాల ర‌వి అనుచ‌రుడు చ‌మ‌న్ గుండెపోటుతో మృతి…

- Advertisement -

దివంగత టీడీపీ నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ చమన్ గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన చ‌మ‌న్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. నిన్న జరిగిన పరిటాల రవి, సునీతల కుమార్తె వివాహానికి చమన్ హాజరయ్యారు. వివాహం సందర్భంగా ఆందరినీ పలకరిస్తూ, ఎంతో సంతోషంగా గడిపిన చమన్ మరణవార్తతో టీడీపీ నేతలు షాక్ అయ్యారు. అనంతపురం పట్టణంలో విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మగా కూడా చమన్ పని చేశారు

చమన్ పరిటాల రవికి ప్రధాన అనుచరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు. అయితే 2004 తర్వాత జరిగిన ఫ్యాక్షన్‌ హత్యలతో చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత 2012లో మళ్లీ అనంతపురం వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం టీడీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు.ఆ తర్వాత ఒక ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు అనంతపురం జడ్పీటీసీగా పని చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -