వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తూ, ఇప్పటికే వినియోగదారుల అభిమానాన్ని పతంజలి సంస్థ సొంతం చేసుకుంది. త్వరలోనే దుస్తుల విభాగంలోకి కూడా ప్రవేశిస్తామని ప్రకటించిన పతంజలి…చెప్పినట్లు గానే చేసింది. మార్కెట్లోకి పతంజలి దుస్తులను విడుదల చేసింది.
స్వదేశీ సంప్రదాయంతో ‘పతంజలి పరిధాన్’పేరుతో దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. సోమవారం ఢిల్లీలో పతంజలి పరిధాన్ మొదటి స్టోర్ను ప్రారంభించారు. దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా మార్కెట్లోకి.. పతంజలి జీన్స్ను విడుదల చేశారు. ఈ దుస్తులపై భారీ డిస్కౌంట్ను ఇస్తోంది.
పతంజలి పరిధాన్ కింద మూడు బ్రాండ్స్ను విడుదల చేశారు. ఆస్థా, సంస్కార్, లైవ్ ఫిట్ బ్రాండ్స్ కింద దాదాపు 3500 రకాల వస్త్రాలు, షూస్, యాక్సెసరీస్ను అందుబాటులోకి వచ్చాయి. తొలి వస్త్రదుకాణాన్ని తెరిచినందుకు గాను పతంజలి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్ కింద వస్త్రాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇక పతంజలి జీన్స్ రూ.500కే లభిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
రూ.2500 బ్రాండెడ్ షర్ట్స్ రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ పురస్కరించుకొని ఒక జీన్స్, రెండు టీ షర్టులను(రూ.7000 విలువ చేసే) కేవలం రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని దోచుకుంటున్న మల్టీ నేషనల్ కంపెనీలను నియంత్రించేందుకు స్వదేశీ వస్త్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు రాందేవ్ బాబా. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్స్ను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు.
Patanjali Paridhan is launching three brands – Aastha, Sanskar & LIVE-FIT today with 3500 variants of Apparal, Home Textile, Shoes & Accessorises. Join live on various TV channels at 12 noon today or join at NSP Pritampura, New Delhi pic.twitter.com/X9p730PAb1
— स्वामी रामदेव (@yogrishiramdev) November 5, 2018