మనుషులు మరి దారుణంగా మారుతున్నారు. ఎక్కడ అవకాశం ఉంటె అక్కడ నొక్కేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటన మరోటి జరిగింది, లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 9న కాకినాడలో బహిరంగ సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో.. పవన్ ఆంధ్రా కు ప్రత్యేక ప్యాకెజీ కోసం చేసే పోరాటం కాకినాడ నుండే మొదలు పెడతానని చెప్పాడు. ఇప్పుడు కాకినాడలో బహిరంగ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు బ్లాక్ మెయిలింగ్ లు, డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. బలవంతంగా డబ్బులు వసూలు చేసి, ఇవ్వని వారిపై గుండాయిజం కూడా చలాయిస్తున్నారట !! అయితే ఈ డబ్బులు గుంజేది ఎవరనేది మాత్రం సస్పెన్స్ గా మారింది? ఈ మద్యే తిరుపతి బహిరంగ సభలో తనదగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఈ వసూళ్ల దందాకు బీజం పడింది.
ఈ డబ్బులు వసూలు చేస్తున్నది పవన్ కు చెందిన మనుషులు కారని, పవన్ పేరు వాడుకుని ఇలా దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ విషయం పై కాకినాడలో తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఈ విషయం పవన్ కు తెలిస్తే ఎలా ఉంటుందో, మరి ఈ విషయం పై అయన స్పందన ఏమిటో చూడాలి?
Related