- Advertisement -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ ఎంపీలపై జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను కొంతమంది ఎంపీలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ‘రాజకీయంగా ఆయన మనకు మిత్రుడు. మనం కలుపుకొని పోవాలి. విమర్శలు చేసేవాళ్లు చేస్తున్నా మనం ఏం చేస్తున్నామో ప్రజలకు వివరిస్తుండాలి. అది మన బాధ్యత’’ అని చంద్రబాబు చెప్పారు.
సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా.. ‘‘పవన్ కల్యాణ్ మా మిత్రపక్షం. ఆయనతో మాకు విభేదాలు లేవు. ఇంకా బాగా పని చేయాలనే ఆయన మాకు చెప్పారు. ఆయన సూచనలను కూడా తీసుకుని ముందుకు వెళతాం’’ చెప్పారు.