Thursday, April 25, 2024
- Advertisement -

సూరత్ మెట్రో ప్రాజెక్టుకి ప్రధాని శంకుస్థాపన..!

- Advertisement -

గుజరాత్​ అహ్మదాబాద్ మెట్రో రెండవ దశ పనులతో పాటు.. సూరత్ మెట్రో ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ వర్చువల్​గా హాజరవుతారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. అహ్మదాబాద్ మెట్రో రెండవ దశలో భాగంగా 28.25 కి.మీ. పొడవైన కారిడార్​ను రూ .5,384 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఇక నూతనంగా నిర్మించబోయే సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పొడవు 40.35 కిలోమీటర్లు. రెండు కారిడార్లున్న ఈ ప్రాజెక్టు వ్యయం రూ .12,020 కోట్లు.గుజరాత్‌లోని రెండు ప్రధాన నగరాలకు పర్యావరణహిత, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయని పీఎంఓ నేడు ఒక ప్రకటనలో తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -