ఫేస్బుక్లో పరిచయమైన ఓ అమ్మాయి ట్రాప్లో పడి.. ఓ సైనికాదికారి దేశద్రోహానికి పాల్పడిన సంఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇక వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్న ఓ మిలటరీ అధికారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఐఎస్ఐ సంస్థకు చెందిన ఓ మహిళా ఏజెంట్ మిలటరీ అధికారిని తన ఫేస్బుక్ ద్వారా ట్రాప్లోకి దింపింది. అతని ద్వారా మిలటరీ స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల సారాంశం, వారి రాకపోకల వివరాలను రాబట్టింది. ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ దేశద్రోహిని అరెస్టు చేసి నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బుధవారం హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని చంచల్గూడ జైలుకు తరలించారు.