Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ను అవమానపరిచేలా బయోపిక్ తీస్తే వెంటపడికొడతారు.

- Advertisement -
Posani Murali Krishna Shocking Comments on Ram Gopal Varma

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు,విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ప్రకటన వెలువడిన కొంచెం సేపటికే, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి స్పందించారు. తాజాగా, ఈ విషయమై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కూడా త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

{loadmodule mod_custom,GA1}

ఎన్‌టీఆర్‌ బయోపిక్ తీస్తే కనుక, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిందేనని, వ్యక్తిగత జీవితం ముట్టుకోకుండా సినిమా తీయలేరని, నందమూరి కుటుంబసభ్యులను బాధపెట్టడం ఎందుక‌ని సూచించారు, బయోపిక్ తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పై బయోపిక్ తీయాలనే ఆలోచనను విరమించుకుంటే మంచిదని చెబుతున్నాను’ అని పోసాని చెప్పుకొచ్చారు. ‘రామారావుగారిని అవమానపరుస్తూ బయోపిక్ తీస్తే..స్క్రీన్ ని చింపేస్తారు..వెంటపడికొడతారు. ఆయనకు అవమానం జరిగితే, తక్కువ చేసి మాట్లాడితే చాలా డిస్ట్రబెన్స్ అవుతుంద‌ని వ‌ర్మ‌ని హెచ్చ‌రించారు.
ఇదే విష‌య‌మై ల‌క్ష్మీ పార్వ‌తి కూడా స్పందించారు. ఎన్టీఆర్ సినిమాపై ఇంతకుముందే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆమె.. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ సినిమాలో ఆయన పాత్రను బాలకృష్ణ చేయకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.‘ఎన్టీఆర్ సినిమా జీవితం వరకు చిత్రించేట్లయితే బాలకృష్ణ హీరోగా చాలా బావుంటాడు. ఆయన సరిపోతాడు. అయితే.. రాజకీయ జీవితాన్ని కూడా సినిమాలో చూపించేట్లయితే.. బాలకృష్ణ నటించడం కరెక్ట్ కాద‌న్నారు.మ‌రి వ‌ర్మ ఎంత‌వ‌ర‌కు ఆలోచిస్తారో చూడాలి.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}hz94JPrxkhw{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -