Sunday, April 28, 2024
- Advertisement -

పీకె టీమ్.. వైసీపీ టీమ్ ల మ‌ధ్య విబేధాలు..

- Advertisement -

వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌గ‌న్ టీమ్, పీకె టీమ్ ల మ‌ధ్య పోర భీక‌రంగా న‌డుస్తుంద‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. పాద‌యాత్ర ప్రారంభం అయ్యి నాలుగురోజులు కూడా కాక‌ముందె పార్టీలో ఉన్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా పీకెటీం మ‌రియు జ‌గ‌న్ టీం నాయ‌కుల మ‌ధ్య వార్ న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా పీకె టీమ్ ఇచ్చిన స‌ర్వే ఫ‌లితాలు పూర్తి వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. వైసీపీ గెలుస్తుంద‌ని స‌ర్వేలో ఫ‌లితాలు వ‌చ్చినా చివ‌ర‌కు టీడీపీ విజ‌యం సాధించింది. అప్ప‌టి నుంచె పీకె టీమ్ మ‌రియు పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య విబేధాలు న‌డుస్తున్నాయి. పీకె టీమ్ స‌భ్యులు స్థానికులు కాక‌పోవ‌డంతోపాటు క‌నీసం తెలుగుకూడా తెలియ‌ని వాల్ల‌కు ఇక్క‌డున్న స్థానిక ప‌రిస్థితులు ఏం తెలుస‌ని గ‌తంలో త‌మ బాధ‌ను వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు తాజాగా మ‌రో సారి విభేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ వ్యాన్ నుంచి మాట్లాడేపుడు వెనుకాలే ఓ అమ్మాయి నిల్చొని ఉంది. ఆమె తన ద‌గ్గ‌ర ఉన్న రెండు సెల్‌ఫోన్‌ల‌తో వీడియోలు తీస్తోంది. వీరు జ‌గ‌న్ ప్ర‌సంగాల‌కు జ‌నం నుంచి ఎలా స్పంద‌న వ‌స్తుంది. అలాగే జ‌నం ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాల‌ను రాబ‌డుతున్నార‌ని తెలుస్తోంది. జగన్ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా ప్రశాంత్ టీమ్ పర్యవేక్షిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇక్క‌డే తేడా వ‌చ్చింది . దీంతో ఇద్ద‌రి టీం ల‌మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన‌ట్లు తెలుస్తోంది. పీకేటీమ్‌లో మొత్తం హిందీ బెల్ట్ వారే కావ‌డంతో ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నారు జ‌గ‌న్ టీమ్. వారికి తెలుగు రాక పోవ‌డంతో ప్ర‌జ‌ల‌నుంచి ఎలా ఫీడ్ బ్యాక్ తీసుకుంటార‌ని వారికి క‌మ్యూనికేష‌న్ ఎలా ఉంటుందో తెలియ‌ద‌ని జ‌గ‌న్ టీమ్ చెబుతోంది. మొత్తానికి హైద‌రాబాద్‌లో ఇన్నాళ్లు కొట్టుకున్న ఈ రెండు బ్యాచ్‌లు ఇప్పుడు పాద‌యాత్ర‌లో కూడా ఆధిపత్య పోరు న‌డుస్తోంది. రెండు టీంల‌మ‌ధ్య ఉన్న విబేధాల‌తో నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. రెండు టీంలు జ‌గ‌న్ గ‌ట్టెక్కిస్తాయో లేక కొంప‌ముంచుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -