Thursday, May 16, 2024
- Advertisement -

బీజేపీ – టీడీపీ తెగదెంపులు ఖాయం .. ఆఖరి తేదీ ఇదే ..

- Advertisement -

ఏపీ స్పెషల్ స్టేటస్ పుణ్యమా అని ఇప్పటికే బీజేపీ – టీడీపీ ల మధ్యన ఉన్న యుద్ధం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఏకంగా వీరిద్దరి బంధం పెటాకులు అయ్యే వరకూ పరిస్థితి చేరేలా కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు. అల్లటప్పా నాయకులు ఏమీ ఇప్పుడు కొట్టుకోవడం లేదు ఏకంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తి పాటి పుల్ల్లరావు బీజేపీ తో టీడీపీ విడిపోయే డేట్ ని కూడా చెప్పెయ్యడం విశేషం.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో ప్రభుత్వ గురుకుల స్కూల్ ని ప్రారంభించిన ప్రత్తిపాటి ఈ హోదా విషయం లో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎంతగా పోరాడారు అనేది చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎక్కడా తగ్గకుండా మోడీ తో చర్చలు జరుపుతున్నారు అని కానీ ప్రతిపక్షం ఇంకా తమ వైఖరి మార్చికోకపోవడం మూర్ఖత్వం అన్నారు ఆయన.

తమ ప్రయత్నాలు ఫలించి రాష్ట్రానికి 13వ తేదీ నాటికి ప్రత్యేక హోదాతో పాటూ ప్యాకేజీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లేకుంటే కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడానికైనా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పుల్లా రావు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -