Tuesday, April 16, 2024
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన మోదీ..!

- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఏడాదికి పైగా వేధిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. టీకాలు వేయించుకునేందుకు ఆరోగ్య కార్యకర్తలు తరలివస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా టీకా కేంద్రాలను సుందరంగా అలంకరించారు.

3006 కేంద్రాలలో 3 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు నేడు టీకాలు వేయనున్నారు. వర్చువల్ విధానంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు మోదీ. పలువురు టీకా లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూసింది అని అన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ కార్యక్రమం ఇదే అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -