విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. టీచర్ తప్పుచేస్తె అది అతనికే కాదు దాని ప్రభావం విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపించనుంది. కన్నబిడ్డలుగా చూడాల్సిన విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
ముంబైలోని ఓ పాఠశాలలో విద్యార్తిని గర్భవతిని చేసి, విషయం బయటకు రాకుండా రూ.50 లక్షలను ఇవ్వజూపిన ఘటన వెలుగుచూసింది. ముంబయిలోని
మహాత్మా గాంధీ మిషన్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్లహరిశంకర్ శుక్లా అనే ఉపాధ్యాయుడు బాలికపై పలుమార్లు అత్యాచరా యత్నం చేశారు.ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయాలని భావించారు. పాఠశాలకు చెందిన ప్రిన్సిఫాల్ సవితా గులాటీ బాధితురాలి తల్లికి రూ.50 లక్షలను లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు వచ్చాయి.తమకు పెద్దవాల్లతో పరిచయాలు ఉన్నాయి..మీరు ఎక్కడికి వెల్లినా మిమ్మల్ని మెడలు పట్టి గెంటెస్తారని ప్రిన్సిపల్ బెదిరించిన వైనం బయటకు వచ్చింది.
మహాత్మా గాంధీ మిషన్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న హరీష్ శంకర్ శుక్లా వరుస అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఆ బాలిక గర్భవతి అని తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్లా అరాచకాలపై పోలీసులు, సీబీఎస్ఇ బోర్డుకి ఫిర్యాదు చేశారు.సీబీఎస్ఈ సైతం త్రిసభ్య కమిటీ వేసి స్కూల్పై విచారణకి ఆదేశించింది. ఆ తర్వాత హడావుడిగా దర్యాప్తు చేపట్టిన స్కూల్ మేనేజ్మెంట్.. ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.
మకి జరిగిన అన్యాయాన్ని కమిటీకి వివరించిన బాధితురాలి తల్లిదండ్రులు త్రిసభ్యకమిటికి వివరించారు.రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపడంతోపాటు తమ ట్రస్టు నిర్వహిస్తున్న ఆస్పటల్లో ఉచితంగా అబార్షన్ చేయిస్తామని చెప్పారని తల్లిదండ్రులు చెప్పారు.స్కూల్ నిర్వహణపై పరిశీలించిన కమిటీ అసలు పర్మీషనే లేదని తేల్చారు. ఉపాధ్యాయుడు శుక్లాపై 18 సార్లు పిర్యాలు వస్తే అతనిపై చర్యలతీసుకోలేదని కమిటీ విచారనలో తేలింది.
సీబీఎస్ఈ నియమనిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని ఏర్పాటైన మహాత్మా గాంధీ మిషన్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ ఆరణలోనే స్టేట్ సిలబస్ స్కూల్తోపాటు మరో లా కాలేజ్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన కమిటీ స్కూల్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}