Friday, May 3, 2024
- Advertisement -

విజయనగరం జిల్లా ఎస్ కోట వద్ద తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

విజయనగరం జిల్లా ఎస్ కోట వద్ద పెను ప్రమాదం తప్పింది. విజయనగరం నుంచి ఎస్ కోట మీదుగా అరకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మంటలను గమనించి డ్రైవర్ ప్రయాణీకులను దించివేశాడు. ప్రయాణీకులంతా దిగిన వెంటనే బస్సు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకీ తీసుకువచ్చారు. ఐతే అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ఈ ప్రమాదంలో ఎవరికి అపాయం జరగక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా డిక్కీలో నుంచి మంటలు చెలరేగాయని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -