Friday, April 26, 2024
- Advertisement -

ఉక్రెయిన్ పరిస్థితులపై బాలీవుడ్ బ్యూటీ విచారం

- Advertisement -

కేవలం సినిమాల పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాలపై కొందరు సినీ ప్రముఖులు అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముందుంటుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందించింది. అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.

ఉక్రెయిన్‌లో ఎంతోమంది ప్రజలు, తమ ప్రాణాలు, తమ ప్రియమైన వారి ప్రాణాలకు హాని జరుగుతుందేమోనని భయపడుతున్నారు. తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ విపత్తు ఆధునిక ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడం కష్టం.

కానీ యుద్ధం వల్ల కలిగే పర్యవసానాలను ఈ ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ యుద్ధభూమిలో మీలాంటి, నాలాంటి ఎంతోమంది అమాయక ప్రజలు బతుకుతున్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు రండి’ అంటూ ప్రియాంక చోప్రా రాసుకొచ్చింది.

పవర్ స్టార్ అభిమానులకు షాక్

దుమ్మురేపుతున్న నాటు సాంగ్

మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త భయాలు.. వారి అనుమానాలు నిజమవుతాయా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -