Friday, April 26, 2024
- Advertisement -

మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త భయాలు.. వారి అనుమానాలు నిజమవుతాయా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఈ సినిమాతో మహేశ్ మరో హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. అందుకు కారణం ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుండటమే. కీర్తి కెరీర్ ‘నేను శైలజా’ సినిమాతో తెలుగులో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ‘మహానటి’ సినిమాను తనను ఆకాశంలో తీసుకెళ్లి నిలబెట్టింది. కీర్తి సురేశ్ అనగానే మహానటి అని గుర్తొచ్చేలా చేసింది ఆ సినిమా.

అయితే మహానటి తర్వాత కీర్తికి ఏ భాషలోనూ హిట్ అందలేదు. దాదాపు తాను నటించిన అరడజను సినిమాలు ఫ్లాప్‌గానే నిలిచాయి. ఇటీవల విడుదలయిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా అయితే కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దాంతో అప్పటినుండి మహేశ్ ఫ్యాన్స్‌కు భయం మొదలయ్యింది. కీర్తి సురేశ్‌ను ఒక్కసారిగా ఐరెన్ లెగ్ అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌పై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

అంతే కాదు సర్కారు వారి పాట మే లో విడుదలకు సిద్ధమవుతుండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది. ‘గాంధారి’ అనే పేరుతో విడుదలయిన ఈ మ్యూజిక్ వీడియోకు పాజిటివ్ రెస్పాన్స్‌కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేశ్‌లాంటి స్టార్‌తో నటిస్తున్న సమయంలో ఇలాంటి మ్యూజిక్ వీడియో చేయడమేంటి అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -