Friday, May 17, 2024
- Advertisement -

బాబు స్టైల్‌లో ఏదో చేద్దామనుకున్నాడు….. ప్రజల దెబ్బకు పరార్

- Advertisement -

వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత భారీ రేటుకు టిడిపికి అమ్ముడుపోయాడు. మంచి రేటుకు టిడిపి తనను కొనుక్కుందని స్వయంగా ఆ ఎమ్మెల్యేనే చెప్పాడు. కానీ ఆయనను గెలిపించిన ప్రజలకు మాత్రం నాలుగేళ్ళుగా చిప్పే మిగిలింది. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో ప్రజల మధ్య తిరుగుతూ మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబులానే ఈ ఎమ్మెల్యేగారు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంటూ ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజలందరూ కూడా తనకు పూలమాలలు వేస్తారు అని అనుకున్నాడు. అయితే ప్రజలు మాత్రం ఇంకో సినిమా చూపించారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున గెలిచి టిడిపిలో చేరిన మణిగాంధీకి ఎదురైన ఆ అనుభవం ఏంటంటే……?

ప్రజల సమస్యలను వినడానికి అంటూ చాలా కాలం తర్వాత ప్రజల ముందుకు వెళ్ళాడు మణిగాంధీ. అందరూ వచ్చి సమస్యలు ఏకరువుపెడుతూ ఉంటే చూస్తాం………చేస్తాం…….అంటూ మాటలు చెప్తూ ఉన్నాడు. అక్కడున్న జనాలకు కోపం వచ్చినప్పటికీ అందరూ కూడా ఎమ్మెల్యేతో పెట్టుకోవడం ఎందుకులే అని సైలెంట్‌గా ఉన్నారు.

అయితే ఒక 80ఏళ్ళ వయసున్న వృద్ధురాలు మాత్రం ఎమ్మెల్యే మణిగాంధీని విమర్శలతో ఉతికి ఆరేసింది. ‘చూస్తాం……చేస్తాం అంటున్నవ్………ఇంకెప్పుడు మేం సచ్చినాక చేస్తవా……….’ అంటూ ఎమ్మెల్యేని విమర్శలతో ఏకిపడేసింది. నాలుగేళ్ళుగా అసలేమీ చేయలేదని……ఎన్నికలొస్తున్నాయని ఇప్పుడొచ్చి మాటలు చెప్తున్నారని విమర్శల వర్షం కురిపించింది ఆ వృద్ధురాలు. వెంటనే ఎమ్మెల్యే మణిగాంధీ మనుషులు ఆ వృద్ధురాలిని పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు కానీ జనంలో నుంచి ఇంకొంత మంది కూడా అదే స్థాయిలో విమర్శల వర్షం కురిపించడంతో …….అన్నీ చేస్తాం అంటూ ఏవో మాటలు చెప్పేసి అక్కడ నుంచి హడావిడిగా ఎస్కేప్ అయ్యాడు మణిగాంధీ. ‘మళ్ళొస్తడుగా…….ఓట్లడగడానికొస్తే అప్పుడు సెప్దాం’ అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ప్రారంభంలో చంద్రబాబు స్టైల్‌లోనే 80శాతం పైగా ప్రజల్లో సంతృప్తి ఉందన్న మణిగాంధీకి సభ చివరికి అసలు విషయం అయితే బోధపడి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -