గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ ఓ పొరపాటు చేశారు. అక్టోబర్ 11 బుధవారం రాత్రి రాహుల్గాంధీ ఛోటా ఉడేపూర్ జిల్లాలో పొరపాటున లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లిపోయారు. యువతతో ఫేస్ టూ ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఆయన సంవాద్ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన రెండు గంటలు మాట్లాడారు.
ఆ తర్వాత టౌన్ హాల్ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లిపోయారు. అక్కడ అది మహిళలా టాయ్లెటా? లేక పురుషులదా? అన్న సంకేత బొమ్మలు లేవు. అక్కడ కేవలం గుజరాతీలో రాసి ఉంది. గుజరాతీ చదవడం రాహుల్ గాంధీకి రాకపోవడంతో.. ఆయన మహిళల టాయ్లెట్లోకి వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీ లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లగానే.. ఆ ఘటనను మీడియా ప్రతినిధులు కవర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయినా, కొందరు మీడియా ప్రతినిధులు ఈ ఘటనను తమ కెమెరాలో బంధించారు. రాహుల్ గాంధీ లేడీస్ టాయ్లెట్ నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న స్థానికులు తెగ నవ్వుకున్నారు.