సమాజం తల దించుకొనే సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. నగ్నంగా వెల్తున్న వివాహితకు సానుభూతి చూపించాల్సి పోయి అటుగా వెళ్తున్న కొంత మంది వ్యక్తులు ఆదుకోవాల్సింది పోయి తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకొని రాక్షసానందం పొందారు. అత్తింటి వేధింపులకు తోడు ఆమే బట్టలు సైతం చింపి రోడ్డు పైకి నెట్టివేశారు. దీంతో చింపిన బట్టలతోనే.. అలా ప్రాణ భయంతోనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాధు చేసింది. రాజస్థాన్లోని చురూ జిల్లాలో ఆదివారం ఈ ఘటన (మే 12) చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెల్తే….మహారాష్ట్ర్రలోన అకోలాకు చెందిన ఓ మహిళకు రాజస్థాన్ లోని చురు ఓ వ్యక్తితో కొన్ని ఏళ్ల క్రితం పెళ్లి జరగింది. రోజూకూలీ అయిన భర్త కుటుంబాన్ని పోషించడం కోసం పని నిమిత్తం అసోం వెళ్లిపోవడంతో ఆమెకు వేధింపులు తీవ్రమయ్యాయి. ఆదివారం బాధితురాలి అత్త, ఆడపడచు ఆమెతో ఘర్షనకు దిగారు. దీంతో ఘర్షన ముదరడంతో ఘర్షణ ముదరడంతో వారిద్దరూ కలిసి ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి దుస్తులు చించేశారు.
అత్తింటి వారి వేధింపులు భరించలేక చివరకు నగ్నంగా చిరిగిన బట్టలతోనె పోలస్ స్టేషన్కు వెల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి.. ఫిర్యాదును స్వీకరించారు. తనను చంపేస్తారనే భయంతోనే అలా నగ్నంగా పోలీస్ స్టేషన్కు పరుగు తీసినట్లు బాధితురాలు తెలిపింది.బాధిత మహిళ నడిరోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే కొందరు ఫోటోలు తీశారు. రోడ్డు వెంట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నగ్నంగా వెల్తున్న ఆమె పోటోలను తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.