Friday, May 3, 2024
- Advertisement -

రాఘవేంద్రుడి స‌న్నిధిలో రజనీ

- Advertisement -
  • మంత్రాల‌యంలో ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్‌కు ఆధ్యాత్మిక భావ‌న చాలా ఎక్కువ‌. త‌న ప్ర‌తీ సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత హిమాల‌యాల‌కు వెళ్లి ఓ వారం రోజులు గ‌డుపుతారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ధాన్యం చేస్తూ ప‌రధాన్యంలో మునుగుతారు. ఆ విధంగా చేస్తే త‌న‌కు చాలా మాన‌సిక ప్ర‌శాంత‌త ఏర్ప‌డుతుంద‌ని చాలాసార్లు తెలిపారు. అదే విధంగా ర‌జ‌నీకి రాఘ‌వేంద్ర స్వామి అంటే చాలా ఇష్ట‌దైవ‌మ‌ని తెలుసు.

అత‌డు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ర్నూలులోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర మంత్రాల‌యంలో వాలిపోయాడు. మంత్రాలయం రాఘవేంద్రస్వామిని రజనీకాంత్‌ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన నటించిన 2.0 సినిమా విడుదల అవుతుండ‌డంతో స్వామిని దర్శించుకున్నట్లు సమాచారం. తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేసిన త‌ర్వాత గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుదీంద్ర తీర్థులను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. అత‌డి ఆశీర్వాదం పొందారు. ఎవ‌రికీ తెలియ‌కుండా, ఆల‌యానికి కూడా స‌మాచారం లేకుండా ర‌జ‌నీ మఠానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు తుంగభద్రనదికి వెళ్తున్న సమయంలో కొందరు భక్తులు చూసి ర‌జ‌నీ ర‌జ‌నీ అని ఎగ‌బ‌డ్డారు. అయితే వారికి తమిళనాడు మంత్రి అని చెప్పి అధికారులు వారిని పంపేశారు. అనంతరం మఠానికి చేరుకోగానే గుర్తించిన భక్తులు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు, కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. రజనీకాంత్‌ రాకతో మఠంలో సందడి నెలకొంది.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ 2.0 సినిమాలో న‌టిస్తున్నారు. ర‌జ‌నీకి పోటీగా జాతీయ ఉత్త‌మ న‌టుడు అక్ష‌య్‌కుమార్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా ఆడియో విడుద‌ల దుబాయ్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. తాను న‌టించిన క‌బాలీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయినా ర‌జ‌నీకాంత్ జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -