Monday, April 29, 2024
- Advertisement -

పవన్ ఆవేదన.. వర్మకు అవకాశం

- Advertisement -

ఒకరికి ఆవేదన.. మరొకరికి వెటకారం.. వివాదాలతో కాలం గడిపే రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ఎదురుచూస్తుంటాడు. అలానే వెతికి వెతికి విమర్శలు చేస్తుంటారు.

ఏపీలో వైసీపీ గెలుపును.. టీడీపీ ఓటమిని పండుగ చేసుకున్న వాళ్లలో రాంగోపాల్ వర్మ ఒకరు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని విడుదల చేయకుండా అడ్డుకున్న చంద్రబాబు ఓడిపోయాక వర్మ కసి తీర్చుకున్నాడు. వరు స ట్వీట్లు, మీమ్స్, సోషల్ మీడియాలో సెటైర్ పోస్టులు ఎండగట్టారు..

ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు రాంగోపాల్ వర్మ. తాజాగా ట్విట్టర్ లో పవన్ పై సెటైర్లు వేశారు. తాజాగా పవన్ జనసేన ఓటమిపై మంగళగిరిలో అభ్యర్థులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తనను ఓడించడానికి కుట్ర పన్నారని.. భీమవరంలో 150 కోట్లు ఖర్చు చేసి ఓడించారని సంచలన కామెంట్స్ చేశాడు.

ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని రాంగోపాల్ వర్మ పవన్ పై సెటైర్లు వేశారు. 150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనని వర్మ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లకు అవమానం అని.. ఆ ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని కూడా పవన్ కే ఓటు వేసారు కదా అంటూ వర్మ దెప్పిపొడిచారు. ఇలా పవన్ ఆవేదనను కూడా తనకు అవకాశం మలుచుకొని సెటైర్లు వేశారు వర్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -