Saturday, April 27, 2024
- Advertisement -

వామ్మో.. రాందేవ్ బాబా అలాంటి మందులు అమ్ముతున్నాడా!

- Advertisement -

యోగా గురు బాబా రాందేవ్ కొన్ని సంవత్సరాలుగా బాగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం..  

యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు పలకడం.. హిందుత్వ వాదులతో కలిసి మెలిసి కనిపించడంతో ఈ యోగా గురు వార్తల్లో  కివస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తదితర పక్ష నేతలు బీజేపీ నేతలపైన, ఆర్ ఎస్ ఎస్ వారిపై న ఎలాంటి విమర్శలు చేస్తారో రాందేవ్ బాబాపై కూడా అలాంటి విమర్శలు చేస్తున్నాయి.

ఇటీవల హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే రాందేవ్ కు క్యాబినెట్ హోదా ఇచ్చింది. ఆయన సలహాలూ సూచనలకోసం ఆ హోదాను ఇవ్వగా ఆయన తిరస్కరించారు. అది వేరే విషయం. 

ఇప్పుడేమైందంటే.. రాందేవ్ బాబా ఆయుర్వేద మెడిసిన్ గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. బాబా కు అలాంటి మందుల విషయంలో పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఈయన అలాంటి మందుల్లో భాగంగా “పుత్ర సంతానాన్ని ఇచ్చే మందు” ను అమ్ముతున్నారట. దాన్ని వాడితే అబ్బాయిలు పుడతారు అంటూ దంపతులకు వాటిని అమ్ముతున్నారు. దీనిపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఒకవైపు “బేటీ బచావో.. బేటీ పడావో..’ వంటి పథకాన్ని ప్రమోట్ చేస్తున్న రాందేవ్ బాబా ఇలా తన సంస్థలతో పుత్ర సంతానం గురించి మందులు అమ్మించడం ఏమిటి? అంటూ విపక్షాల వారు విరుచుకుపడుతున్నారు.

దీనిపై సమాధానం చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ అపసోపాలుపడుతోంది. అసలు మగసంతానం కోసం మందు అనేది సైంటిఫిక్ గా చెల్లుబాటు కాదు.. ఆ విధంగా చూస్తే ఇలాంటి మందులు అమ్మడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కూడా. మరి దీనిపై రాందేవ్ బాబా ఏమని వివరణ ఇచ్చుకొంటాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -