టాలివుడ్ స్టార్ హీరో రవితేజ తమ్ముడు భరత్ మరణంపై అనేక సందేహాలు,అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భరత్ మద్యమత్తులో డ్రైవింగ్ చేశారాలేకా నిద్రలో ఉండంగా ప్రమాదం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కారులో ఆయనతోపాటు ఎవరు ప్రయాణిస్తున్నారు? వారెందుకు భరత్ను వదిలేసి వెళ్లిపోయారు? కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు అందించలేదు? రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగితే ఉదయం వరకు తెలియక పోవడంచూస్తె అనే ప్రశ్నలు లేస్తున్నాయి.
{loadmodule mod_custom,GA1}
శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ నుంచి భరత్ బయలుదేరినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి బయలుదేరిన అర్ధగంటలోపే భరత్ యాక్సిడెంట్కు గురయ్యాడు. ప్రమాద సమయంలో భరత్ వెంట కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. వారికి గాయాలయ్యాయా.. అయితే వారెక్కడ ఉన్నారు? వారు బయటపడకపోవడం వెనుక బలమైన కారణమేమిటి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రమాదం జరగడానికి ముందుభరత్, ఎవరిని కలిశాడు. ఎవరితో అర్ధరాత్రి వరకు ఉన్నాడు. ఏ స్థితిలో వస్తున్నారు? ఇలాంటి విషయాలు బయటపడుతాయనే ఉద్దేశంతోనే భరత్ మిత్రులు గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారా? అనే వాదన వ్యక్తమవుతున్నది.నేర పరిశోధనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత బాగా ఉపయోగపడుతున్నది. పోలీసుల ప్రాథమిక విచారణలో నోవాటెల్ నుంచి భరత్ బయలుదేరేటప్పుడు కారులో మరో ముగ్గురు ఉన్నారన్న విషయం తేలింది.వాళ్లు ఎవరనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
{loadmodule mod_custom,GA2}
కారు ప్రమాదం జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే కారులో మరెవరు ఉన్నా బతికే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ బతికిన తీవ్ర గాయాలయ్యే పరిస్థితి ఉంది. ఈ ఘటనలో ఆ ముగ్గురు ఎవరు. వారు మధ్యలో ఎక్కడ దిగిపోయారు అనేవి ఇప్పుడు సంచలనంగా మారాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}SeURNN4Qq5A{/youtube}