Saturday, May 4, 2024
- Advertisement -

సీఎం కేసిఆర్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల..!

- Advertisement -

సీఎం కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని యాదాద్రి దేవస్థానంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

వేదదపండితులు సుదర్శన యాగం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు వైద్యచికిత్స కొనసాగుతోంది. స్వల్పంగా లక్షణాలు ఉండడంతో సోమవారం యాంటీజెన్ పరీక్ష చేయగా కొవిడ్ నిర్ధరణ అయింది. అటు ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ సీఎం కేసీఆర్​కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి ఐసోలేషన్​లో ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు కోరుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా భగవంతుడు ఆయణ్ని ఆశీర్వదించాలని వేడుకున్నట్లు చెప్పారు.

సీఎం జగన్ కి చంద్రబాబు కృతజ్ఞతలు!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -