Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

- Advertisement -

దేశంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మహమ్మారి బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. తనకు కరోనా పాజిటివ్ అని స్వయంగా రాహుల్ గాందీ తెలిపారు.

స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారని రాహుల్ గాంధీ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను నేరుగా కలుసుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీ మార్గనిర్దేశం దేశానికి చాలా అవసరమని రాహుల్ అన్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి పలువురు రాజకీయ నాయకులు కరోనా భారిన పడి చనిపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చారు. మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

FLASH : నగరంలో మెట్రోరైల్ కొత్త టైమింగ్.. పాటించాలి తప్పదు..!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్..

మైనర్ ను గర్భవతిని చేసిన టిక్ టాక్ నటుడు భార్గవ్ అరెస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -