రాజకీయాలు అనేవి బయట వరకు మాత్రమే.. వ్యక్తిగతం కాదు.. ఎవరి మనోభావాలు నొప్పించకుండా చాలా కూల్ గా వెళ్లేవారిలో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకరు. ఏపిలో అమలు అవుతున్న ప్రతి పథకాలు పేదలకు చెందాలని.. అందులో తమ పార్టీ వేరే పార్టీ అనే తారతమ్యాలు అస్సలు ఉండొద్దని వాలీంటర్లకు ఎప్పుడూ చెబుతుంటారు. తనకు ఓటు వేయని వారికి కూడా ప్రతిఒక్క పథకం చేరువ కావాలని అంటుంటారు.
నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్లో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.