దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్తో ముందుకువచ్చింది. జియో మాస్ ప్లాన్ పేరుతో దీన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.98కే ఉచిత కాలింగ్ సౌకర్యంతో పాటు నెలకు 2జీబీ డేటాను ఇవ్వనుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. మరింత మంది కస్టమర్లను సంపాదించేందుకు రిలయన్స్ జియో ఈ ప్లాన్ను తీసుకొచ్చింది.
దేశంలో జియో టెలికాం సేవలు ప్రారంభమైన తర్వాత అతి తక్కువ ధరలకే 4జీ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ రంగంలో అప్పటికే ఉన్న కంపెనీలకు జియో తేరుకోలని షాకిచ్చింది. ఇపుడు మరోసారి ధరల యుద్ధానికి తెరతీసింది. జియో తాజాగా ప్రకటించిన రూ.98 ప్లాన్ను ప్రకటించింది.
ఈ ప్లాన్ తో సగటున ఓ యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్ పీయూ) మరింత తగ్గుతుందని జేపీ మోర్గాన్ అంటోంది. జియో తక్షణ లక్ష్యం మాస్ విభాగాన్ని ఆకర్షించడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. జియో 98 ప్లాన్ అర్థవంతమైన ప్లాన్ అని క్రెడిట్ సూసే పేర్కొంది. దీనివల్ల పోటీ సంస్థలకు మరిన్ని నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని అంచనా వేసింది. ఈ ప్రాన్ ప్రకటించిన తర్వాత భారతీ ఎయిర్టెల్ షేరు విలువ 6.51 శాతం, ఐడియా కంపెనీ షేరు విలువ రూ.5.38 శాతం మేరకు పడిపోయింది.