Thursday, May 16, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డికి ఆ డబ్బు ఎవరిచ్చారో గుర్తించిన ఏసిబి

- Advertisement -

ఓటుకు నోటు కేసులో ఏసిబి అధికారులు మరో కీలక ఘట్టాన్ని ఛేదించారని సమాచారం. ఈ కేసులో ఏసిబి అధికారులకు ఫోరెన్సిక్‌ ల్యాబ్ నుంచి కీలకమైన నివేదిక అందింది.

అదేంటంటే మీడియా కథనాల ప్రకారం స్టీఫెన్‌సన్‌కు రేవంత్ ఇచ్చిన 50లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు. ఈ డబ్బు అమీర్‌పేట్ లోని ఒక చిట్‌ఫండ్ సంస్థ నుంచి రేవంత్ రెడ్డికి అందినట్లు ఏసిబి అధికారులు గుర్తించారు.

ఆ డబ్బునే టిఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటును కొనేందుకు ఇవ్వజూపారని సమాచారం. అయితే ఆ చిట్‌ఫండ్ కంపెనీ వివారాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్‌పై తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -