- Advertisement -
ఓటుకు నోటు కేసులో ఏసిబి అధికారులు మరో కీలక ఘట్టాన్ని ఛేదించారని సమాచారం. ఈ కేసులో ఏసిబి అధికారులకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కీలకమైన నివేదిక అందింది.
అదేంటంటే మీడియా కథనాల ప్రకారం స్టీఫెన్సన్కు రేవంత్ ఇచ్చిన 50లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు. ఈ డబ్బు అమీర్పేట్ లోని ఒక చిట్ఫండ్ సంస్థ నుంచి రేవంత్ రెడ్డికి అందినట్లు ఏసిబి అధికారులు గుర్తించారు.
ఆ డబ్బునే టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనేందుకు ఇవ్వజూపారని సమాచారం. అయితే ఆ చిట్ఫండ్ కంపెనీ వివారాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్పై తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.