Friday, May 10, 2024
- Advertisement -

బాబుపై విరుచుకుపడి, కేసిఆర్ ను పొగిడిన రామ్‌గోపాల్ వర్మ!

- Advertisement -

రామ్‌గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు మారు పేరు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారాయన. ఆయన రాసే ట్వీట్లతో అందర్ని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో నోటుకు ఓటు కేసు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం అందరికి తెలిసిందే.  

రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే విషయంపైనా ఆయన స్టైల్ లో సంచలన ట్వీట్ చేశాడు. నోటుకు ఓటు స్కాంను బేస్ చేసుకుని ఏపి సిఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో కేసిఆర్ ముక్కుసూటి తనాన్ని పొగుడుతూనే, చంద్రబాబు ఈ మొత్తం వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మరింత వివాదాస్పదం చేశారు అని ఏపి ప్రభుత్వాన్ని ధూషించారు.

 తాను ఏ ప్రాంతీయ వాదిని కానని చెబుతూనే చంద్రబాబును టార్గెట్ చేస్తూ పరోక్షంగా ట్వీట్లు చేశారు. నోటుకు ఓటు కేసులో ఇప్పటికే జైలులో ఉన్న రేవంత్ రెడ్డి పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -