Saturday, April 27, 2024
- Advertisement -

వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!

- Advertisement -

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఒకదానికొకటి ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని మోమిన్ పేటలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు సమాచారం. చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన బస్సు, కూలీలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటోలోని కూలీలంతా ఇజ్రాచిట్టంపల్లికి చెందినవారిగా గుర్తించారు. 

ఈ దెబ్బకు రోడ్డు మీద చెల్లా చెదురుగా వాహనాలు పడి పోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి గాయపడినవారికి ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -