కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు క్రికెట్ దిగ్గజం సచిన్. అక్రమాలకు పాల్పడుతున్న హెల్మెట్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాణ్యతలేని మెటిరీయల్తో హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఓ క్రికెటర్గా హెల్మెట్ ఎంత ముఖ్యమో తనకు తెలుసని… అలాంటి వాటి విషయంలో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. క్వాలిటీ ఉన్న హెల్మెట్లు ఉంటేనే ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు… జనాలు తెలియక ఇలాంటి నకిలీ వాటినే కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నాణ్యమైన హెల్మెట్లు లేకపోవడం వల్లే ప్రమాదాల్లో ఎక్కువమంది చనిపోతున్నారని లేఖలో రాశారు.
ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని… అందుకే ఈ అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నానని లేఖలో వివరించారు. నకిలీ హెల్మెట్లు ధరించే వారు ఎక్కువమంది ఉన్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా వారు ఎందుకు చనిపోయారంటే.. వారు ధరించింది నాణ్యమైనవి కాదు. వెంటనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి… నాణ్యతలేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు.