టీమిండియా మాజీ కెప్టెన్, పరుగులు వీరుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సచిన్ తనయుడు అర్జున్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసి అత్యంత అరుదైన ఘనత సాధించాడు. దీంతో ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డులకెక్కారు. ఒకే ఫ్రాంచైజీకి ఆడడం ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి.
ఇక 23 ఏళ్ల అర్జున్ ముంబై ఇండియన్స్ 2021 వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే, ఐపీఎల్ అరంగేట్రం కోసం అర్జున్ రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో అవకాశం లభించింది. ఈ మ్యాచ్లో తొలి ఓవర్ను బౌల్ చేసిన అర్జున్ ఆ తర్వాత మరో ఓవర్ వేశాడు. మొత్తంగా 17 పరుగులు ఇచ్చాడు. అయితే, బ్యాటింగులో మాత్రం అవకాశం రాలేదు. కాగా, ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై ఐపీఎల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది.