Thursday, May 9, 2024
- Advertisement -

ఆ ముగ్గురు హీరోలకు గొడవలౌతున్నాయి

- Advertisement -

టాలీవుడ్లో ఫైటింగ్లు… ఎప్పుడూ టాప్ హీరోల మధ్యనే కాదు. అప్పుడప్పుడు కుర్ర అప్ కమింగ్ హీరోల మధ్యన కూడా ఉంటూ ఉంటాయి.ఆ ఫైటింగ్ ఏంటో తెలుసుకోవాలంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకే డేట్ కోసం కొట్టుకుంటోన్న హీరోల దగ్గరకి పోవాలి. ఇక్కడ కనిపించే ఆ ముగ్గురు హీరోలు ఎవరో కాదు …తేజు,వరుణ్ ,బెల్లంకొండ శ్రీనివాస్ . ముందు ఇద్దరు బావ బామ్మర్దులే. కాని ఇద్దరికీ మధ్య సరిగా పొసగడం లేదని రూమర్లు రౌండ్లు కొడుతున్నాయి.దీనికి కారణం… వీరు చేసిన చిత్రాలకు డేట్ ఫిబ్రవరి నెలలో ఒకటే కావడం.

నిజానికి ముందు ఫిబ్రవరి 9కి సాయిధరమ్ తేజ్-వి.వి.వినాయక్ సినిమాను రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. అదే రోజున ఈవిషయం తెలిసి కూడా వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉండడటం ఇక్కడ గొడవలకు కారణంగా తెలుస్తుంది. వీరంటే ఏదో బావ బామ్మర్దులు ఇలా చేస్తున్నారనుకోవచ్చు.మరి బెల్లంకొండ శ్రీనివాస్ కేమైంది.

అసలే శ్రీను తండ్రి సురేష్ … టైమ్ బాగోక దెబ్బ మీద దెబ్బ తినేసి ఉన్నాడు. అయినప్పటికీ శ్రీను వారి టైమ్లో తన సాక్ష్యం చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ ఓ సారి ఆలోచిస్తే అతను చేస్తుంది ఎంత తప్పో అర్ధమవుతుంది. సంక్రాంతి టైమ్లో పెద్ద హీరోల మధ్య తమ సినిమాను రిలీజ్ చేసి…వార్ సీన్ లో ఎలాగ-ఊ నిలబడలేరు కాబట్టి ఫిబ్రవరి 9 తారీఖును వీరు మరో సంక్రాంతి సీజన్ ఫైట్ లా చేయాలనుకుంటున్నారా ఏమిటి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -