Friday, March 29, 2024
- Advertisement -

డాక్టర్ శాంత కన్నుమూత.. మోదీ కన్నీటి పర్యంతం..!

- Advertisement -

ప్రముఖ క్యాన్సర్​ వైద్య నిపుణులు, చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ ఛైర్​పర్సన్​ శాంత కన్నుమూశారు. 93 ఏళ్ల శాంత.. ఛాతిలో నొప్పి రావడం వల్ల సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డాక్టర్ శాంతకు నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందించేందుకు డాక్టర్​ శాంత చేసిన కృషి మరువలేనిది. పేదలకు చికిత్స అందించడంలో క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ అడయార్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ సందర్భంగా 2018లో నేను ఆ ఆస్పత్రిని సందర్శించిన క్షణాలు గుర్తుచేసుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని మోదీ కోరారు.

డాక్టర్ శాంతను ఎన్నో అవార్డులు వరించాయి. పద్మశ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషణ్​ సహా మెగసెసే అవార్డులు ఆమె సొంతమయ్యయి. 50 ఏళ్ల వైద్య జీవితాన్ని పేదల కోసం, క్యాన్సర్​ రోగుల కోసం అంకితం చేసిన శాంత.. ఆస్పత్రికి వచ్చే తెలుగువారికి సహాయ సహకారాలు అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -