అమ్మాయి కనిపిస్తే చాలు అతనిలోని కామాంధుడు నిద్రలేస్తాడు. వరుసగా మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న సీరియల్ రేపిస్ట్ను ఎట్ట కేలకు పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్కు గురయ్యారు.
ఈ కామాంధుడు ఒకరా ఇద్దరా ఏకంగా 17 మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.ముంబై మహానగరంలోని నాయనగర్ వుడ్ల్యాండ్ సొసైటీలో నివాసముంటున్న ఖురేషీ బిల్డర్లకు భవన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతను నిత్యం నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద తిరుగుతూ.. ఒంటరిగా ఉన్న బాలికలను చూసి.. ‘‘ మీ నాన్న పిలుస్తున్నాడని’’ చెప్పి వారిని జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు.
ఇలా నవీ ముంబై, థానే, థానే గ్రామీణం, పాల్ఘర్ జిల్లాల్లో 17 మంది చిన్నారులపై తన మృగవాంఛను తీర్చుకున్నాడు. ఈ దారుణానికి పాల్పడేటప్పుడు తన లొకేషన్ ను పోలీసులు గుర్తుపట్టకుండా ఫోన్ ను స్విచ్ఛాప్ చేసేవాడు. కొందరు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఖురేషీని అరెస్ట్ చేశారు. ఇతనిపై కేసులను విచారించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని నవీముంబై కమిషనర్ నిర్ణయించారు.