- Advertisement -
తిరుమల శ్రీవారి అన్న ప్రసాదానికి ఓ ఎన్ ఆర్ ఐ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. దుబాద్ లో ఉంటున్న ఎన్ ఆర్ ఐ శైలేష్ కుమార్ దాస్ ప్రతి ఏటా తిరుమల వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.
శనివారం నాడు ఆయన తిరుమల వచ్చి స్వామి వారి అన్నప్రసాద కార్యక్రమానికి తన వంతు విరాళంగా కోటి 32 లక్షల రూపాయలు ఇచ్చారు. గతంలో కూడా శైలేష్ కుమార్ దాస్ స్వామి వారికి కోటి రూపాయలు ఒకసారి, 15 లక్షలు మరోసారి విరాళంగా ఇచ్చారు.
విరాళం ఇచ్చిన తర్వాత శైలేష్ కుమార్ దాస్ సామాన్య భక్తుల క్యూ లైన్లోనే స్వామి వారి దర్శనానికి వెళ్లడం విశేషం.