కోల్కతా కేంద్రంగా హైదరాబాద్లో విస్తరించిన హైటెక్ వ్యభిచార దందాలో దిమ్మతిరగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదాపూర్లో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి … భార్యాభర్తలు రాజేశ్ పర్వాల్, ఆర్తీ పర్వాల్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో దిమ్మతిరిగే నిజాలు వెల్లడయ్యాయి.
వ్యభిచార ముఠాకు నాయకుడు సంజయ్ని చెప్పి…..వారు ఇచ్చిన సమాచరాంతో ఏడుగురు వ్యభిచార గృహ నిర్వాహకులు పట్టుబడ్డారు. సంజయ్ అండ్ గ్యాంగ్ ఎక్కువగా టార్గెట్ చేసేది మోడల్స్నే. తొలుత వారితో పరిచయం పెంచుకుని సంజయ్.. నెమ్మదిగా వారికీ లగ్జరీ లైఫ్ అలవాటు చేస్తాడు. పెద్ద పెద్ద నగరాల్లో జరిగే పార్టీలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరీ.. ఎంజాయ్ చేయాలంటూ పంపిస్తుంటాడు. ఆ తర్వాత డబ్బు ఆశచూపి వారిని వ్యభిచారంలోకి దింపుతాడు.
లగ్జరీలైఫ్కు అలవాటు పడ్డ యువతులకు లక్షల్లో డబ్బు ఆఫర్ చేసి ప్రలోభ పెడుతాడు. వారానికి రూ.2లక్షలు ఇస్తానని చెబుతాడు. దీంతో డబ్బు ఆశకు చాలామంది యువతులు ఇతని వలలో చిక్కుకున్నారు. ఒక్కసారి యువతులు కమిట్ అయితే.. వారి ఫోటోలను పలు వెబ్ సైట్స్ లో పోస్టు చేస్తాడు.
ఆన్ లైన్ ద్వారానే వీరంతా యువతులను బుక్ చేయడం, విటుల వద్దకు పంపించడం చేస్తుంటారని పోలీసులు నిర్దారించారు. ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ల్లో ఇందుకోసం సంజయ్ ప్రత్యేకమైన గ్రూప్స్ క్రియేట్ చేశాడు. రోజుకు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు కస్టమర్ల నుంచి వసూలు చేయాలని ఆయా నగరాల్లోని నిర్వాహకులను ఆదేశించాడు.
వ్యభిచారంలో ప్రధానంగా ఈవెంట్ మోడల్స్, డ్యాన్సర్స్, సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోలేని అమ్మాయిలు ఉన్నారు. వ్యభిచార దందాల్లో ఎక్కువగా ముంబై, కోల్కాతా, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన యువతులు ఉన్నట్లు తేలడం గమనార్హం. నిందితుడు సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడితే మరిన్ని నిజాలు వెలుగు చూస్తాయి.