- Advertisement -
- చిత్రీకరణ అధిక శాతం నేపాల్లో భానుమతి, మహానుభావుడు కలవనున్నారు. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అదేనండీ ఫిదా హీరోయిన్ సాయి పల్లవి, మహానుభావుడు హీరో శర్వానంద్ కలిసి నటించనున్నారు. వరుస విజయాలతో ఎక్స్ప్రెస్ రాజగా దూసుకెళ్తున్న యువ నటుడు శర్వా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈసారి లై దర్శకుడు హను రాఘవపూడికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో శర్వానంద్ రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. శర్వానంద్ జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ షూటింగ్ కోసం నేపాల్కు చిత్రబృందం బయల్దేరనున్నట్టు సమాచారం.
అయితే శర్వానంద్ ఈ సినిమా తరువాత ఆయన రెండు ప్రాజెక్టులు చేయడానికి అంగీకరించాడు. ఈ రెండు సినిమాల షూటింగులు సమాంతరంగా కొనసాగనున్నాయి. ఒక సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు. అయితే ‘ఫిదా’ తో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టిన సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తోంది. తన నటనతో ప్రేక్షకులను మైమరపింపజేసింది. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమా చేస్తండగానే ఈ సినిమాకు చేస్తోంది. శర్వానంద్తో చేస్తున్న సినిమా ఆమెకి మూడో సినిమా. కథాపరంగా ఈ సినిమా షూటింగ్ నేపాల్లో ఎక్కువగా జరపనున్నారట.