Tuesday, May 7, 2024
- Advertisement -

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో దారుణం.. ప్ర‌ధాని స‌భ‌కు వెళ్తూ స్కూల్ బ‌స్సు బోల్తా..

- Advertisement -

హిమాచాల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం కాంగ్రాలోని లంజ్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సభకు విద్యార్థులను తీసుకెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయ లాంటి ప్రాంతంలోకి జారిపోయింది. ఈ ప్ర‌మాదంలో 35 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు.

బస్సు బోల్తా కొట్టడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జు అయిందన్నారు. వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పడం కారణంగానే పల్టీలు కొట్టిందని వెల్లడించారు.

ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లో సందర్శించనున్న నేపథ్యంలో ధర్మశాలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ కోసమే విద్యార్ధులను ధర్మశాలకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -